calender_icon.png 22 October, 2024 | 6:10 PM

అడిషనల్ కలెక్టర్‌పై ఏసీబీ కేసు నమోదు

22-10-2024 04:06:08 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రంగారెడ్డి ల్యాండ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. రంగారెడ్డి అదనపు కలెక్టర్ వెంకటభూపాల్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారు అడిషనల్ కలెక్టర్ పై కేసు నమోదు చేశారు. వెంకట భూపాల్ రెడ్డి ఇళ్లు, బంధువుల ఇళ్లో సోదాలు నిర్వహించారు. ఆయనకు రూ.5.05 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఆదాయానికి మించి రూ.4.19 కోట్ల స్థిర, చరాస్తులు, బహిరంగ మార్కెట్ లో ఆస్తులు మరింతగా ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది. గతంలో కూడా ధరణిలో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు భూపాల్ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ద్వారా లంచం తీసుకుంటూ  అదనపు కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డి పట్టుబడారు.