calender_icon.png 26 February, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భైంసా ఎక్సైజ్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు

25-02-2025 10:31:36 PM

రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై, కానిస్టేబుల్‌...

బైంసా (విజయక్రాంతి): లంచం తీసుకుంటూ ఓ ఎక్సైజ్‌ ఎస్సై, కానిస్టేబుల్‌ పట్టుబడిన ఘటన భైంసా ఎక్సైజ్‌ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి... భైంసా మండలంలోని కామోల్‌కు చెందిన సుభాష్‌గౌడ్‌ అనే కల్లు వ్యాపారికి, అదే గ్రామానికి చెందిన మరో కల్లు వ్యాపారికి కల్లు విక్రయాల విషయమై గొడవ తలెత్తింది. దీంతో ఈ విషయం పోలీసుస్టేషన్‌ వరకు వెళ్లింది. ఈ క్రమంలో సమస్య పరిష్కరించాలని సుభాష్‌గౌడ్‌ ఎక్సైజ్‌ ఎస్సై నిర్మలను సంప్రదించగా, ఆమె కానిస్టేబుల్‌ సుజాత ద్వారా రూ.10వేలు డిమాండ్‌ చేశారు. దీంతో సుభాష్‌గౌడ్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు పథకం ప్రకారం కానిస్టేబుల్‌ సుజాతకు డబ్బు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీలు విజయ్‌కుమార్, రమణమూర్తి, సీఐలు కిరణ్, స్వామి, సిబ్బంది ఉన్నారు.