హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని జిల్లాలో విద్యావలంటీర్ల నియామకాలు జరిపి రిలీవ్ కానీ ఉపాధ్యాయులను బదిలీ అయిన స్థానాలకు పంపాలని కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్కుమార్ డిమాండ్చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాలకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమిస్తూ వారికి నెల గౌరవ వేతనం రూ.15,600గా నిర్ణయించడంపట్ల హర్షం వ్యక్తంచేశారు. అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకాలు వెంటనే పూర్తి చేసి రిలీవ్కానీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయ పోస్టుతో పాటు బోధనేతర పనుల కోసం ఓ నాన్ టీచింగ్ పోస్టును మంజూరు చేయాలని కోరారు.