calender_icon.png 24 September, 2024 | 9:02 AM

రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ఎత్తివేత

24-09-2024 02:08:36 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): రైల్వే ప్రయాణికులు 85 శాతం మేర ఆన్‌లైన్ రిజర్వేషన్ల వైపు మొగ్గు చూపడంతో రైల్వేశాఖ క్రమంగా తన రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా నగరంలోని అమీర్‌పేట స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లో, మెహిదీపట్నం ఎక్స్ రోడ్‌లోని ఎస్జీఎం మాల్‌లో ఉన్న రిజర్వేషన్ కౌంటర్లను తొలగిస్తున్నట్లు ద.మ.రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 14 నుంచి ఈ రిజర్వేషన్ కౌంటర్లను పూర్తిగా మూసేస్తున్నట్లు ఆయన వివరించారు. అమీర్‌పేట ప్రాంతానికి సంబంధించిన రైల్వే ప్రయాణికులు బేగంపేట, నేచర్ క్యూర్ హాస్పిటల్ రైల్వే స్టేషన్లలో, మెహిదీపట్నం ఏరియా రైల్వే ప్రయాణికులు హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్ నుంచి రైల్వే రిజర్వేషన్ సదుపాయాన్ని పొందాలని సూచించారు.