calender_icon.png 23 October, 2024 | 7:00 PM

క్రీడాపోటీల్లో ఆశ్రమ విద్యార్థుల సత్తా

29-08-2024 04:30:48 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 28(విజయక్రాంతి): నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా నగరంలోని ఎల్బీస్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బోయిన్‌పల్లిలోని ప్రభుత్వ గిరిజన పాఠశాల విద్యార్థులు 45మంది పాల్గొని, 28మంది పతకాలు సాధించారు. సత్తాచాటారు. అండర్14 ఫెన్సింగ్ పోటీల్లో బీ కోటేశ్వ ర్‌రావు, అండర్ 17లో కే కిట్టు గోల్డ్ మెడల్ సాధించారు. స్విమ్మింగ్ పోటీలో బీ చరణ్ సిల్వర్‌మెడల్ సాధించాడు. కబడ్డీలో ప్రథమస్థానంలో నిలిచారు. విద్యార్థులను జిల్లా గిరిజ న సంక్షేమాధికారి ఆర్ కోటాజీ, ప్రధానోపాధ్యాయుడు బానోతు లాలు, వార్డెన్ రెబెకా, ఎల్లమ్మ, ఉపాధ్యాయులు అభినందించారు.