దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల సాధికారిత శాఖ డైరెక్టర్ విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): తెలంగాణలోని ట్రాన్స్ జెండర్ల కోసం రాష్ట్రస్థాయి ఆధార్ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని దివ్యాంగులు, సీనియర్ సిటిజెన్స్, ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖ డైరెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్లోని ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 22 నుంచి 24 వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. కొత్త ఆధార్ నమోదు ప్రక్రియ ఉచితంగా ఉంటుందని, ఇప్పటికే ఉన్న ఆధార్లో సవరింపులు చేసుకోవడానికి రూ.50 నుంచి రూ.100 వరకు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వివరాల కోసం 040 నెంబర్ను సంప్రదించాలని సూచించారు.