పటాన్చెరు, జూలై 28: మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ చేసిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పటాన్చెరు డీఎస్పీ రవీందర్రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపాలిటీలోని పీఎన్ఆర్ కాలనీకి చెందిన గట్టుపల్లి అశ్విని గత నెల 24వ తేదీ సాయంత్రం స్కూల్ నుంచి తన పిల్లలను తీసుకురావడానికి ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్పై వచ్చి అడ్రస్ అడుగుతున్నట్లు నటించి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని వెళ్లిపోయారు. అశ్విని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించి బైక్ను గుర్తించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అచ్చాపురం గ్రామానికి చెందిన పస్తం హనుమంతు, మెదక్ జిల్లా శంకరంపేట మండలం మల్కాపూర్కు చెంది న చాకలి సంఘమేశ్వర్ను నిందితులుగా గుర్తించారు. ఆదివారం వారిని అరెస్టు చేసి బంగారు గొలుసు, బైక్ను స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.