ఇబ్రహీంపట్నం, జూలై 28 : ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ జెడ్పీహెచ్ఎస్ 2007 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం మంగళ్పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సత్కరించారు. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు.