యాచారం తండాలో వెలుగు చూసిన ఘటన
కామారెడ్డి (విజయక్రాంతి): మంచంపై పడుకున్నా ఓ యువకుడు పక్కనే ఉన్న విద్యుత్ వైరు కాలుకు తగలడంతో విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా యాచారం తండాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. సదాశివనగర్ ఎస్సై రంజిత్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం యాచారం తండాకు చెందిన మాలోత్ అనిల్ (23) గురువారం రాత్రి ఇంట్లో మంచంపై నిద్రపోతుండగా విద్యుత్ వైర్ కాలుకు తగలడంతో విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. తండాలోని యువకుడు అందరితో కలుపుగోలుగా ఉండే అనిల్ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందడం తండ వాసులను కలచివేసింది. యాచారం తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.