06-03-2025 10:46:41 PM
మంథని (విజయక్రాంతి): మంథని మండలం బిట్టుపల్లి గ్రామ మూలమలుపు వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో స్నేహితుని వివాహానికి వస్తున్న యువకుడు చెట్టును ఢీకొని మృత్యువాతపడ్డాడు. యువకుడు హైదరాబాద్ (గచ్చిబౌలి) నుండి రెండు బైక్ లపై నలుగురు యువకులు వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడు ఉదయ్ గా గుర్తించారు.