calender_icon.png 23 February, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి

23-02-2025 08:15:42 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని పాత బస్టాండ్ జాతీయ రహదారి ఫ్లైఓవర్ వంతెనపై జరిగిన ప్రమాదంలో యువకుడు షేక్ జిలానీ (30) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని యాపల్ ఏరియాకు చెందిన మృతుడు తన సోదరునితో కలిసి పని నిమిత్తం మంచిర్యాలకు వెళ్ళి తిరిగి బెల్లంపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా పట్టణంలోని పాత బస్టాండ్ జాతీయ రహదారి ఫ్లైఓవర్ వంతెనపై బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న మృతుడు అక్కడికక్కడే మృతి చెందగా వెనకాల కూర్చున్న మృతుని సోదరుడు షేక్ మగ్దూం తీవ్రగాయాలు కాగా క్షతగాత్రుడిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతుడు కేకే ఓసిపిలో లారీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.