అంత్యక్రియల్లో పాడె మోసిన ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి
గద్వాల (వనపర్తి), అక్టోబర్ 16 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున గద్వాల మండలం దయ్యాల వాగు సమీపంలోని గద్వాల జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ గద్వాల జిల్లా నాయకుడు పటేల్ ప్రభాకర్రెడ్డి కుమారుడు పటేల్ రాంచంద్రా రెడ్డి(28) బుధవారం తెల్లవారుజామున ఎర్రవల్లి చౌరస్తా నుంచి గద్వాలకు కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి బ్రిడ్జి వాల్ను ఢీకొనడంతో రాం చంద్రారెడ్డి మృతి చెందాడు. అంత్యక్రియల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్రెడ్డి పాడె మోశారు.