calender_icon.png 10 October, 2024 | 6:34 PM

కరెంట్ తీగ తగిలి యువకుడు మృతి

10-10-2024 04:51:07 PM

చేగుంట (విజయక్రాంతి): కరెంట్ తీగ తగిలి యువకుడు మృతి చెందిన సంఘటన చేగుంటలో జరిగింది. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల, గ్రామానికి చెందిన గడ్డమీది అనిల్ (21) చేగుంట లోని తన ఇంటి ముందర ఉన్న చెత్తను తన స్నేహితుడు సమీర్ తో కలిసి చెత్తను తీస్తుండగా ప్రమాదవశాత్తు ఇనుప నిచ్చెన పైనున్న కరెంటు తీగలకు తగలగా ఇద్దరికీ కరెంట్ షాక్ తగలగా అనిల్ ను, సమీర్ చికిత్స నిమిత్తం నార్సింగిలో చారి హాస్పిటల్ తీసుకొని వెళ్లగా అప్పటికే అనిల్ చనిపోయినాట్టు హాస్పిటల్ సిబ్బంది తెలియజేశారు, సమీర్ కు గాయాలు కావడంతో వైద్య చికిత్స అందించడం జరుగుతుందని తెలియజేశారు. అనిల్ తండ్రి ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్ ఐ శ్రీ చైతన్య రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.