బస్సును ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పిన బైకు
పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామ శివారులో ఘటన
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): బస్సును ఓవర్టేక్ చేయబోయి ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి బస్సు కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సందడి శైలేష్ (19) పంట పొలంలో పురుగుమందు పిచికారి చేసేందుకు ముగ్గురు యువకులు బైక్ పై వెలుతూ ముందుగా వెళుతున్న ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయాడు. వెనకాల ఉన్న మరో ఇద్దరు యువకులు కిందికి దూకగా బైక్ నడుపుతున్న యువకుడు బస్సు కింద నలిగి మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే 108ని ఆశ్రయించగా సిబ్బంది వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.