calender_icon.png 30 September, 2024 | 3:06 AM

మహిళను హత్య చేసి చోరీ

30-09-2024 12:52:32 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుం దలో ఆదివారం మధ్యాహ్నం దారు ణం జరిగింది. దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు ఇంట్లోని మహిళను హత్యచేశారు. ఈ ఘటన బిచ్కుదం లో చోటు చేసుకుంది. బిచ్కుందకు చెందిన గోనే కాశవ్వ(65) ఇంట్లో  ఒంటిరగా ఉన్న సమయంలో దుండగుడు చొరబడ్డాడు. కాశవ్వ అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగుడు ఆమెను గొడకేసి కొట్టి చంపి ఇంట్లో వస్తువులను ఎత్తుకెళ్లాడు. ఇంటి ము ందు ఉన్న మహిళ గమనించి ప్రశ్నిస్తుండగా అక్కడి నుంచి పారిపోయా డు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.