calender_icon.png 20 October, 2024 | 3:19 AM

భర్తపై భార్య ఘాతుకం

20-10-2024 12:39:13 AM

మర్మావయవాలను కత్తిరించిన భార్య

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): కుటుంబ కలహాలతో విసుగు చెందిన భార్య తన భర్త మర్మవయవాలను కత్తిరించిన ఘటన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం ఎర్రపెంటలో గత ఆదివారం చోటుచేసుకోగా శనివారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కట్రాజ్ తిరుపతయ్య(35), పోషమ్మ భార్యాభర్తలు.

ఇరువురూ తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో గత ఆదివారం మద్యం సేవించి గాఢ నిద్రలో ఉన్న తిరుపతయ్య మర్మవయవాలను పోషమ్మ కత్తితో కత్తిరించింది. తిరుపతయ్య అరుపులు విని స్థానికులు 108 అంబులెన్సులో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం తిరుపతయ్య క్షేమంగా టున్నట్టు తెలిసింది.