బెంగళూరు, అక్టోబర్ 13: ప్రముఖ జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి గౌరీ లంకేశ్ను హత్యచేసిన దోషులకు బెంగళూరులు హిందూ సంఘాలు ఘన స్వాగతం పలికాయి. 2017 సెప్టెంబర్ 5వ తేదీన బెంగళూరులోని తన ఇంటిముందే గౌరీ లంకేశ్ను మూడు బైక్లపై వచ్చిన దుండగులు కాల్చి చంపారు.
ఈ కేసులో విజయపురకు చెందిన పరుశురాం వాగ్మారే, మనోహర్ యాదవేతోపాటు అమోల్ కాలే, రాజేశ్ వి బంగేరా, వాసుదేవ్ సూర్యవంశీ, రుషికేశ్ దెవదేకర్, గనేశ్ మిస్కిన్, అమిత్ రామ్చంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఐదేండ్లుగా జైల్లో ఉన్న వీరికి ఈ నెల 9న కోర్టు బెయిల్ ఇచ్చింది.
దీంతో శనివారం జైలు నుంచి విడుదలయ్యారు. వీరిలో వాగ్మారే, మనోహర్ తమ స్వస్థలం విజయపురకు చేరుకోగా స్థానిక హిందూ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఉన్న శివాజీ విగ్రహం వద్దకు తీసుకెళ్లి వారిని సన్మానించారు.