calender_icon.png 4 October, 2024 | 6:47 PM

గాయత్రి మాతగా దర్శనం

04-10-2024 03:58:12 PM

కొండపాక (విజయక్రాంతి ): సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవములు వైభవోపేతంగా జరుగుతున్నాయి శుక్రవారం నాడు విజయదుర్గా మాత గాయత్రి మాతగా దర్శనం ఇచ్చింది.ఉదయం 6 గంటలకు గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభం కాగా విజయదుర్గా మాతకు విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించారు పట్టువస్త్రాలతో అలంకరించి చతుష్షష్టి ఉపచారపూజ చేశారు పది గంటల నుండి సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో రాహుకాల పూజ నిర్వహించారు అనంతరం నవావరణ హవనం చేశారు.భక్తుల జరధ్వానాల మధ్య పల్లకీ సేవ క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభను ఇనుమడింపజేసింది.భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.