calender_icon.png 22 September, 2024 | 4:27 AM

బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్

22-09-2024 01:46:54 AM

వ్యక్తి దుర్మరణం

నల్లగొండ, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడుగులపల్లి మండలం ఇందుగులకు చెందిన పుట్ట శేఖర్ (32) శనివారం ఉదయం డీజిల్ తీసుకెళ్లేందుకు బైక్‌పై మాడుగులపల్లి శివారులోని పెట్రోల్ బంక్‌కు వచ్చాడు. క్యాన్‌లో డీజిల్ పోయించుకొని తిరిగి వెళ్తుండగా అద్దంకి నార్కెట్‌పల్లి రహదారిపై వెనుక నుంచి వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో శేఖర్ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వ్యాన్ డ్రైవర్ పరారయ్యేందుకు యత్నిస్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.