calender_icon.png 21 October, 2024 | 5:18 PM

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన వ్యాన్

29-07-2024 12:19:26 AM

  • దంపతులకు తీవ్ర గాయాలు

కొడుకు పరిస్థితి విషమం

మద్యం సేవించి వ్యాన్ నడిపిన డ్రైవర్

భీమదేవరపల్లి, జూలై 28: మద్యం మత్తులో వ్యాన్‌ను నడిపి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో దంపతులు తీవ్రంగా గాయపడగా, వారికి కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నది. ములకనూర్ ఎస్సై సాయిబాబు తెలిపిన వివరాల ప్రకార.. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల ఇందుర్తి శివారు చింతలపల్లికి చెందిన భీమెర రమేశ్, గౌతమి దంప తులు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హనుమకొండలో చదువుకుంటు న్నాడు. ఆదివారం హనుమకొండకు పెద్ద కుమారుడ్ని చూసేందుకు చిన్న కుమారుడు హిమాన్షును కూడా తీసుకెళ్లారు. కుమారుడ్ని చూసి ద్విచక్రవాహనంపై తిరుగు పయనమ య్యారు. ముల్కనూర్ శివారు లో ద్విచక్రవాహనాన్ని వ్యాన్ ఢీకొనడంతో హిమాన్షుకు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రిలి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. రమేశ్, గౌతమిలకు కాళ్లు, చేతులు విరిగిపోయి. హన్మకొం డ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రానికి చెందిన వ్యాన్ డ్రైవర్ కొక్కెర్ల రాజు మద్యం సేవించి నడపడంతోనే ప్రమాదం జరిగిందని ముల్కనూర్ ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.