టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు
నల్లగొండ, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమిస్తామని టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. నల్లగొండ పట్టణంలోని జడ్పీ సమావేశ మందిరంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కమిటీని ఆదివారం ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డీఏ, పీఆర్సీ, సీసీఎస్ విధానం రద్దు అంశాలపై పోరాడేందుకు కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరుపై సీఎంకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీతో ప్రమాణం చేయించారు.