ఇద్దరు కూలీలు మృతి
ఖమ్మం, అక్టోబర్ 21 (విజయక్రాంతి): కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలో బోల్తాపడటంతో ఇద్దరు కూలీలు మృతిచెం దారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బిడియాతండా గ్రామం సమీపంలోని కట్టేబోడు బ్రిడ్జి వద్ద సోమవారం రాత్రి జరిగిం ది. రఘునాధపాలెం మండలంలోని గణేశ్వరం గ్రామంలో కూలి పనికి వెళ్లి తిరిగి సాయంత్రం ట్రాక్టర్లో కూలీలు ఇంటికి బయలుదేరారు.
బోడియాతండా వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టి పక్కనే ఉన్న సాగర్ కాల్వలో పడిపోయింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు స్థానికుల సహాయంతో ట్రాక్టర్ను, మృతదేహాలను వెలికి తీశారు. కొణిజర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తు న్నారు. మృతులు వైరాలోని శాంతినగర్ పాత తండాకు చెందిన బాణోత్ భీందేవ్(45), భూక్యా సైదులు(50) గా పోలీసులు గుర్తించారు. మరికొం త మంది కూలీలకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.