calender_icon.png 25 September, 2024 | 2:08 PM

రజిత మృతిపై సమగ్ర దర్యాప్తు

24-09-2024 01:13:04 AM

నల్లగొండ, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం మొలకలపల్లి గ్రామానికి చెందిన జాల రజిత(29) అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సోమవారం తెలిపారు. అదనపు ఎస్పీ రాములునాయక్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. ఇప్పటికే పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణ ఆధారంగా ఈ కేసులో ఈ నెల 9న జాల రాములు అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదిక రాగానే వాటి ఆధారంగా ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

కాగా రజితను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసును తారుమారు చేసేందుకు స్థానిక పోలీసులు యత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహి ళ మృతి వెనుక మరో ముగ్గురి ప్రమే యం ఉందని, నిందితులను తప్పించేందుకు ఎస్సైకి ముడుపులు అందినట్లు వార్తలు వచ్చాయి.