calender_icon.png 5 October, 2024 | 4:56 AM

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

05-10-2024 12:00:00 AM

మహేశ్వరం, అక్టోబర్ 4: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతిచెందిన ఘటన పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డి కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి ప్రాంతానికి చెంది న మహ్మద్ అబ్దుల్ అలీ (18) అనే విద్యార్థి శుక్రవారం ఉదయం కూరగాయలు తీసుకురావడానికి యాక్టివా బైక్‌పై మార్కెట్‌కు వెళ్లాడు. అబ్దుల్ అలీ జల్‌పల్లి కాంతబాబా సమీపంలోకి రాగానే వేగంగా రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చిన పల్సర్ బైక్ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో అబ్దుల్ అలీ తలకు తీవ్రగాయమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.