కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి
గిరిజన, విద్యార్థి సంఘాల డిమాండ్
ఎల్బీనగర్, జూలై 21: ఆర్కేపురం డివిజన్ పరిధి హరిపుర కాలనీలోని శ్రీచైతన్య కళాశా లలో కేకే బాలికల క్యాంపస్ ఇంటర్ సెకండి యర్ విద్యార్థిని శనివారం రాత్రి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. మార్కుల ఒత్తిడితోనే విద్యార్థిని ఆత్మహ త్యాయత్నం చేసినట్టు సమాచారం. కాగా, ఆదివారం విద్యార్థిని తల్లిదండ్రులు, బం ధువులు కళాశాల వద్దకు చేరుకొని ఆం దోళన చేపట్టారు. గిరిజన సంఘాలు, విద్యా ర్థి సంఘాలు ఆర్కేపురం మెట్రో స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించాయి. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులపై మార్కుల కోసం తీవ్ర ఒత్తిడి చేస్తూ ప్రాణాలతో చెల గాటం ఆడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడు తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్ డిమాండ్ చేశారు.