- వాహనదారులను పడగొడతారు
- ఆపై కత్తులతో బెదిరించి సొత్తు, నగదు దోపిడీ
- ఆదిలాబాద్లో రెచ్చిపోయిన దారి దోపిడీ దొంగలు
- స్థానికుల సహాయంతో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
ఆదిలాబాద్, జూలై 28 (విజయ క్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో రోజుకో రీతిలో జరుగుతున్న దొంగతనాలతో జనం బెంబే లెత్తిపోతున్నారు. ఇప్పటివరకు ఇళ్లకు, దుకా ణాలకు ఉన్న తాళాలు పగలగొట్టి దొంగ తనం చేస్తున్న దుండగులు.. తాజాగా రహ దారికి మధ్యలో ఓ తీగను కట్టి వాహన దారులను కింద పడగొట్టి దారి దోపిడీకి పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లాలోని చాంద (టి) గ్రామ సమీపంలోని బ్రిడ్జ్ వద్ద ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ పాత జాతీయ రహదారికి మధ్యలో చీకట్లో కనబడకుండా తీగను కట్టి అటుఇటు వచ్చీపోయే వాహనదారులను కింద పడగొడతారు.
వెంటనే వాహనదారుల దగ్గరికి వెళ్లి కత్తితో బెదిరించి వారి నుంచి నగదు, బంగారాన్ని దోపిడీ చేస్తున్నారు. ఇది గమనించిన స్థానికులు కొందరు.. శనివారం పక్కా ప్లాన్ ప్రకారం మాటువేసి దారి దోపిడీ దుండగులను అడ్డుకొని వాగాదానికి దిగారు. అదే సమయంలో చాకచక్యంగా పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు.. దోపిడీ దుండగులను పట్టుకున్నారు. వారి బ్యాగులను తనిఖీ చేయగా కత్తులు లభ్యమయ్యాయి. కాగా ఈ దుండగులు మహారాష్ర్ట నుంచి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.