calender_icon.png 21 September, 2024 | 12:55 AM

మోదీ ఇంటికి ప్రత్యేక అతిథి

15-09-2024 12:20:12 AM

ప్రధాని నివాసంలో దూడకు జన్మనిచ్చిన గోమాత

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంటికి ప్రత్యేక అతిథి వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ అతిథికి పేరు కూడా పెట్టినట్లు మోదీ తెలిపారు. మన శాస్త్రాల ప్రకారం గోమాత మనకు సర్వసుఖాలను అందిస్తుంది. ప్రధాని కుటుంబంలోకి కొత్త సభ్యురాలు అడుగుపెట్టింది. నా నివాసంలో గోమాత కొత్త దూడకు జన్మనిచ్చింది. దాని నుదుటిపై జ్యోతి గుర్తు ఉంది. అందుకే దూడకు దీప్‌జ్యోతి అని పేరు పెట్టాను అని మోదీ రాసుకొచ్చారు. ఈ దూడకు సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ ఎక్స్‌లో షేర్ చేశారు. అందులో కొత్తగా జన్మించిన దూడను ప్రేమగా నిమురుతూ కనిపించారు. మోదీ తన నివాసంలోని పూజగదిలో దూడ కు పూలమాల వేసి తన ఒడిలో కూర్చొబెట్టుకుని కనిపించారు.