calender_icon.png 30 September, 2024 | 3:04 AM

ఆస్తి కోసం -తండ్రిని చంపిన కొడుకు

30-09-2024 01:02:54 AM

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 29(విజయ క్రాంతి): ఆస్తి పంపకాల విషయంలో కొడు కు తండ్రిపై దాడి చేసి హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల జిల్లా వేములవాడ పట్టణ ంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వేములవాడ పట్టణానికి చెందిన మమిండ్ల మల్లయ్య(51)కు రెండు పెళ్లిల్లాయ్యాయి. తన మొదటి భార్యకు ము గ్గురు బిడ్డలు, కొడుకు రాజేందర్ ఉన్నాడు.

మొదటి భార్య చనిపోయిన తర్వాత పద్మ అ నే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇ ద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత కొన్ని రో జులుగా మొదటి భార్య సంతానమైన ము గ్గురు బిడ్డలు, కొడుకు రాజేందర్ తమకు ఆస్తి పంపకాలు చేయాలని గొడవ చేస్తూ వ స్తున్నారు.

ఆదివారం పెద్ద మనుషుల సమక్ష ంలో పంచాయితీ పెట్టారు. ఈ క్రమంలో కొ డుకు రాజేందర్‌తోపాటు మరి కొందరు మ ల్లయ్యతోపాటు పద్మపై దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో మల్లయ్య అక్క డిక్కడే మృతి చెందాడు. పద్మ తీవ్రంగా గా యపడటంతో ఆసుపత్రికి తరలించారు. దా డి ఘటన పట్టణంలో సంచలనంగా మారింది.