- నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
- 25 సెల్ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): నగరంలో వరుస సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. వివరాలు.. జల్సాలకు అలవాటుపడిన మల్ల్లేపల్లికి చెందిన ఉప్పది దయ(35), మహ్మద్ జహంగీర్(35) ఇదర్దరూ చోరీల బాట పట్టారు. రాత్రుళ్లు బైక్పై తిరుగుతూ ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్ చేస్తూ వారి సెల్ఫోన్లను దొంగిలిస్తున్నారు. ఈమేరకు విశ్వసనీయ సమాచారం మేరకు మాటువేసిన పోలీసులు ఆదివారం నిందితులను, వారి వద్ద నుంచి నిత్యం ఫోన్లు కొను గోలు చేసే కాచిగూడ ప్రాంతానికి చెందిన వినోద్కుమార్ తివారీ(65)ని రెడ్హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేశారు.
వారి నుంచి 25 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిం దితులపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరుపరచనున్నారు. ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన స్పెషల్ జోనల్ క్రైమ్ టీమ్, ఈఓడబ్ల్యూ టీమ్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ భిక్షపతిని డీడీ డీసీపీ శ్వేతారెడ్డి అభినందించారు.