జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందించారు. ‘తిరుచిత్రంబలం‘ చిత్రానికి గానూ నిత్యామీనన్ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా నిత్య మాట్లాడుతూ తన 15 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందని ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఇది తనకు సెలబ్రేట్ చేసుకోవాల్సిన తరుణమని పేర్కొంది. ఈ అవార్డును తన సహనటులు ‘తిరుచిత్రంబలం‘ చిత్ర బృందానికి అంకితమిస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రస్తుతం ధనుష్ హీరోగా, దర్శకుడిగా రూపొందుతున్న ‘ఇడ్లీ కడై’ చిత్రంలో నిత్యామీనన్ నటిస్తోంది.