12-02-2025 05:06:44 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా కేంద్రంలో సంఘ భవన అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని 4వ తరగతి ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారు వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, గణేష్, లక్ష్మణ్, సాయన్న, గంగన్న, సుజాత, లలితా పాల్గొన్నారు.