రేపు లోకాయుక్తలో విచారణ
జగిత్యాల, అక్టోబర్ 1 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దురినియోగంపై అధికారులు తప్పుడు నివేదిక ఇవ్వడంతో ఈ నెల 3న లోకాయుక్తలో విచారణ జరుగనుందని లోకాయుక్త రిజిస్ట్రార్ నోటీసు లు జారీ చేశారు. మంగళవారం ఫిర్యాదుదారుడు చుక్క గంగారెడ్డి విలేకరులతో మాట్లాడారు.
జిల్లా పంచాయతీ ఉన్నతాధికారులు బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దురినియోగంపై లోకాయుక్తకు తప్పుడు సమాచారంతో కూడిన నివేదికలు అందజే శారని ఆరోపించారు. లోకాయుక్త సూచనల మేరకు ఆ నివేదికలపై అభ్యంతరాలను ఈ నెల 3న అందజేయనున్నట్లు వివరించారు.