20-03-2025 02:03:50 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉంది. బడ్జెట్ స్వల్పంగా పెరిగినా ఎన్నికల హామీల అమలుకు కావాల్సిన నిధులు కేటాయించలేదు. ఆర్థిక లోటును పూడ్చేందుకు ఆదాయం ఏ మార్గంలో సృష్టిస్తారో చెప్పలేదు.
ప్రభుత్వోద్యోగులు డీఏలు అడగొద్దని ఇప్పటికే సీఎం కోరారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితిలో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. ఆర్థిక సంక్షోభానికి ఇది ప్రతిబింబం.
- నాగం వర్శిత్ రెడ్డి, బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు