calender_icon.png 5 October, 2024 | 4:55 AM

వేలంపాటలో అరుదైన చేతి గడియారం

05-10-2024 12:43:29 AM

రూ.3.35 కోట్లుపైగా పలుకుతుందని అంచనాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: చంద్రుడిపై అడుగుపెట్టిన దివంగత వ్యోమగామి ఎగ్జార్ మిచెల్ ధరించిన అరుదైన రోలెక్స్ గడియా రాన్ని ఈ నెల 24న వేలం వేయనున్నారు. వేలంలో దీని విలువ రూ.3.35 కోట్లు పలు కుతుందని అంచనా వేస్తున్నారు. మిచెల్ 1971లో అపోలో 14 మిషన్‌లో చంద్రుడిపై కి వెళ్లారు. ఆ సమయంలో ఆయన చేతికి గడియారం ధరించినట్లు పలు ఫొటోల ద్వారా వెల్లడైంది. ఆ గడియారాన్ని ఆర్‌ఆర్ ఆక్షన్ హౌస్ వేలం వేయనుంది. అపోలో మిషన్‌లో ఉపయోగించిన రెండు రోలెక్స్ వాచుల్లో ఇది ఒకటని తెలుస్తోంది.