calender_icon.png 14 October, 2024 | 12:50 AM

అరుదైన గౌరవం

08-10-2024 12:00:00 AM

తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా స్టార్ హీరోయిన్ సమంత రుతుప్రభు అభిమానులు గర్వించదగిన తరుణమిది. ఉత్తరాది కథానాయికలకు దక్కే గౌరవ మర్యాదలు దక్షిణాదాది హీరో యిన్లకు ఉండవన్న భావన చాలా మందిలో ఉంది. కానీ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ కథానాయికల టైమ్ బాగా నడుస్తోంది. ఓ బాలీవుడ్ చిత్రానికి టాలీవుడ్ హీరోయిన్ సమంత ముఖ్య అతిథిగా హాజరు కానుండటమే ఇందుకు నిదర్శనం.

ఇప్పటివరకూ ఇంతటి అద్భుత అవకాశం ఏ హీరోయిన్‌కూ దాదాపూ దక్కలేదు. సమంతకు ఈ అరుదైన గౌరవం దక్కడం విశేషం. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ వాసన్ బాల దర్శకత్వం లో కథానాయిక ఆలియా భట్ నటించిన చిత్రం ‘జిగ్రా’. ఈ సినిమాలో ఆదిత్యానంద, మనోజ్ పహ్వా, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబా ద్‌లో జరగనుంది. అయితే, ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా సమంత రానున్న విషయం తెలిసి  ఆమె అభిమానులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఇటీవల ఆబుదా బిలో అట్టహాసంగా ముగిసిన ఐఫా వేడుకల్లో కూడా సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ‘ఐఫా’ ఆమెను ‘ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో గౌరవించిన విషయం తెలిసిందే.