calender_icon.png 10 October, 2024 | 5:49 AM

పీఆర్సీ రిపోర్ట్‌ను సమర్పించాలి

10-10-2024 01:41:53 AM

టీఎన్జీవో, టీజీవో నేతలు

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి వెంటనే సమర్పించాలని టీఎన్జీవో, టీజీవో అధ్యక్షులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో పీఆర్సీ కమిషన్ చైర్మన్ ఎన్ శివశింకర్‌ను వారు బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ స్పందిస్తూ త్వరలోనే పీఆర్సీ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని, ఉద్యోగులు ఆందోళన పడొద్దని టీఎన్జీవో, టీజీవో నేతలతో ఆయన తెలిపినట్లు పేర్కొన్నారు. పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన వారిలో టీఎ న్జీవో నాయకులు కస్తూరి వెంకటేశ్వ ర్లు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ సంఘం అధ్యక్షులు గడ్డం జ్ఞానేశ్వర్  ఉన్నారు.