నాగర్కర్నూల్ ఆగస్టు 11 (విజయక్రాంతి): గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. బిజినేపల్లి మండలం ఖానాపూర్కు చెందిన కూర నగేశ్ (50) నాగర్కర్నూల్ నుంచి సొంతూరుకు వెళ్తుండగా ఉయ్యాలవాడ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.