మృతికి కారణాలపై పోలీసుల విచారణ
మహేశ్వరం, అక్టోబర్ 18: మద్యం తాగుతూ వ్యక్తి మృతిచెందిన ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వినాయక హిల్స్ రోడ్డు నంబర్ 2లో నివసించే కేశవరావు (60) శుక్రవారం మధ్యాహ్నం అల్మాస్గూడ టీచర్స్ కాలనీలోని విజయ దుర్గ వైన్స్కు వెళ్లాడు. సిట్టింగ్ రూమ్లో మద్యం తాగుతూ సాయం త్రం 4 గంటల సమయంలో మృతిచెందాడు. అయితే, కేశవరావు మృత దేహాన్ని వైన్స్ సిబ్బంది బయటకు తీసుకొచ్చి రోడ్డుపైన పడేశారు. స్థానికులు, వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై శ్రీనివాస్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివ రాలు సేకరించారు. మృతుడి కొడుకు ప్రశాంత్కు సమాచారం అం దించారు. మృతికి కారణం మద్యం తాగడమేనా ? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. కేసును మీర్పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.