calender_icon.png 24 October, 2024 | 9:57 PM

కారు ఢీకొని వ్యక్తి మృతి

22-07-2024 02:17:39 AM

న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట గ్రామస్థుల ఆందోళన

చిన్నకోడూరు ఠాణా వద్ద ఉద్రిక్తత 

సిద్దిపేట రూరల్, జూలై 21: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా వచ్చి న కారు ఢీకొట్టగా సదరు వ్యక్తి చికిత్స పొం దుతూ ఆదివారం మృతి చెందాడు. చిన్నకోడూరు పోలీసులు, బాధిత కుటుంభీకులు తెలిపిన వివరాల ప్రకారం, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లి గ్రామానికి చెందిన బద్దిపడిగ రాజయ్య(60) శనివా రం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఓ కారు రాజయ్యను వెనకనుండి వేగంగా ఢీకొట్టింది. స్థానికులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

మృతునికి భార్య ఎల్లవ్వ, కొడుకు శేఖర్ ఉన్నారు. శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు. రాజయ్య మృతితో చిన్నకోడూరు పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సిద్దిపేట ఏసీపి మధు అక్కడకు చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం కమ్మర్లపల్లికి వెళ్ళి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.