calender_icon.png 23 October, 2024 | 9:59 AM

వ్యక్తి ఆత్మహత్య

23-10-2024 01:19:19 AM

బెల్లంపల్లి, అక్టోబర్ 22: బెల్లంపల్లి పట్టణంలోని మహ్మద్‌ఖాసీం బస్తీకి చెందిన కార్తీక్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని బెల్లంపల్లి వన్‌టౌన్ సీఐ ఎన్ దేవయ్య తెలిపారు. కార్తీక్ గణేశ్ నిమజ్జనం రోజు భార్య శిరీషతో గొడవ పెట్టుకోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయిందని.. దీంతో మనస్థాపానికి గురైన కార్తీక్ సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడని తెలిపారు. మృతుని తల్లి చీర్ల పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ తెలిపారు.