calender_icon.png 25 September, 2024 | 4:00 AM

రైతుహామీల సాధనకు ఒక్కరోజు దీక్ష

25-09-2024 01:54:45 AM

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): హామీలను నెరవేర్చకుం డా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. రైతులను, ప్రజలను మోసం చేస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మంగళవా రం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఏర్పా ఋటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రుణ మాఫీ, రైతు భరోసా, వడ్లకు రూ.500 బోనస్ సహా అన్నదాతలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న ఇందిరాపార్క్ వద్ద ఒకరోజు రైతు హామీల సాధన దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీక్షలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొంటారని ఆయన తెలిపారు.

కార్యకర్తలు, రైతులు పెద్దసంఖ్యలో హాజరై దీక్షకు తమ మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.