calender_icon.png 23 October, 2024 | 3:21 AM

కొడుకు మరణంతో ఆగిన తల్లి గుండె

23-10-2024 12:53:23 AM

ఇల్లెందులో ఘటన

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 22 (విజ యక్రాంతి): కొడుకు మరణాన్ని తట్టుకోలేని తల్లి గుండె ఆగిపోయింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణం లో మంగళవారం చోటు చేసుకొంది. ఇల్లెం దు పట్టణ పరిధిలోని సీతారామ టాకీస్ ప్రాంతానికి చెందిన పసులేటి నరేందర్(60) సింగరేణి ఉద్యోగం చేసి విరమణ పొందా డు. సోమవారం ఉదయం నరేందర్‌కు గుండెపోటు రావడంతో మరణించాడు.

కుమారుడి మరణ వార్త తెలుసుకున్న తల్లి సులోచన(80) వైజాగ్‌లోని తన చిన్న కుమారుడైన కృష్ణ దగ్గర ఉంటూ సోమవా రం రాత్రి ఇల్లెందుకు చేరుకున్నది. రాత్రి మొత్తం కుమారుడి శవంపై పడి విలపిస్తూ ఉంది.  మంగళవారం ఉదయం అంత్యక్రి యల నిర్వహణకు మృతదేహాన్ని వైకుంఠ ధామానికి తీసుకెళ్తున్న క్రమంలో సులోచన గుండెపోటుతో మరణించింది. తల్లి, కుమా రుడు మరణించడంతో ఆ ప్రాంతలో తీవ్ర విషాద చాయలు నెలకొన్నాయి.