calender_icon.png 27 October, 2024 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్మృతి

03-07-2024 01:01:01 AM

హైదరాబాద్, జులై 2 (విజయక్రాంతి): భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దక్షిణాఫ్రికాతో ముగిసిన ఏకైక టెస్టులో భారీ సెంచరీతో కదంతొక్కిన స్మృతి.. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొంది. ఈ  సందర్భంగా టీటీడీ ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగానాయకులు మండపంలో స్మృతికి పండితులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందచేశారు.