calender_icon.png 28 September, 2024 | 2:57 AM

ప్రేమకథను ఆవిష్కరించే మెలోడీ

28-09-2024 12:53:21 AM

హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబోలో తెరకెక్కనున్న తాజా చిత్రం ‘శ్వాగ్’. రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్ మరో కథానాయిక. దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ పలు పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 4న విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు.

శుక్రవారం రిలీజ్ అయిన ‘నీలో నాలో’ పాట ఆకట్టుకుంటోంది. వివేక్ సాగర్ స్వరపర్చగా, భువనచంద్ర సాహిత్యం అందించారు. రాజేశ్ కృష్ణన్, అంజనా సౌమ్య ఆలపించిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. పాటలో శ్రీవిష్ణు, మీరా జాస్మిన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ఈ మెలోడీ ట్రాక్ వారి ప్రేమకథను అందంగా ఆవిష్కరిస్తోంది.