calender_icon.png 28 September, 2024 | 12:54 PM

మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య

28-09-2024 12:31:15 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): తనకు మం త్రాలు చేశాడనే నెపంతో వ్యక్తిని దా రుణంగా హత్య చేసిన ఘటన మ హబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మ ండలం చిన్నముప్పారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. తొ ర్రూర్ సీఐ జగదీష్, ఎస్సై ర మేష్‌బాబు వివరాలు వెల్లడించారు. చి న్నముప్పారం గ్రామానికి చెందిన మల్లం యాకయ్య(60) తనపై చాతబడి చేశాడని అదే గ్రామానికి చెంది న మల్లం రాజు కర్రతో దాడి చేసి, హత్య చేశాడు. నిందితుడిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్ప గించారు. మృతుడి కుమారుడు మ ల్లం రమేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.