శేరిలింగంపల్లి, (విజయక్రాంతి): చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో సెంట్రింగ్ కాంట్రాక్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన తన్నీరు మాల్యాద్రి (37) నగరానికి వచ్చి శేరిలింగంపల్లి తారానగర్ లో నివసిస్తున్నాడు. భార్యాపిల్లలు ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. అయితే గతరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతని మర్మాంగాలపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు ఉండటంతో తాగిన మత్తులో హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం జాగిలాలతో చుట్టుపక్కల గాలిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న ఛందానగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.