పెద్దపల్లి, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): భూతగాదాల నేపథ్యంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకున్నది. పెద్దపల్లి మండలం కొత్తపల్లికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ కలవేన సాయికృష్ణ తండ్రి రాజేశం(60) మాజీ రైల్వే ఉద్యోగి. వీరికి దాయాదులతో భూతగాదాలు ఉన్నాయి. గురువారం పొలం వద్దకు వెళ్తున్న రాజేశంపై దాయాదులు బండరాయితో తలపై కొట్టి దారు ణంగా చంపారు. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ కృష్ణ, సీఐ, ఎస్సై లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు.