calender_icon.png 14 October, 2024 | 5:51 AM

బావిలో పడి వ్యక్తి మృతి

14-10-2024 12:36:35 AM

రాజేంద్రనగర్, అక్టోబర్ 13: బావి లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నరేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. కొందుర్గు మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఇరిగిజ్జ సురేశ్ (26), శిరీష దంపతులు. వీరు కొంతకాలం గా శంషాబాద్ మండల పరిధి శంకరాపురం సమీపంలోని చెర్లగూడెంలో నివాసం ఉంటున్నారు.

సురేశ్ స్థానిక హమీదుల్లానగర్‌లో ఉన్న ఓ గార్డెన్ లో కూలీ పనులు చేస్తుండేవాడు. అయితే, దసరా పండుగ రోజు శనివా రం ఎప్పటిలాగే సురేశ్ పనికి వెళ్లాడు. ఉదయం 11 గంటలకు భార్యకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నాను.. భోజనం సిద్ధం చేయాలని చెప్పాడు. అనంతరం సురేశ్ తనతో పాటు పనిచేసే మల్లేశ్‌తో కలిసి మద్యం తాగాడు.

ఆ తర్వాత అతడి జాడ తెలియరాలేదు. అతడు పనిచేస్తున్న గార్డెన్‌లో వెతుకుతుండగా కాంక్రీట్ బావిలో మృతదే హంగా కనిపించాడు. మద్యం మత్తు లో బావిలో పడి మృతిచెంది ఉండొచ్చని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసుల కు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు.