కామారెడ్డి, అక్టోబర్ 20 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి శివారులో ఎస్ఆర్ దాబా సమీపం లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పద్మా జివాడి ఎక్స్రోడ్డు నుంచి వస్తున్న లారీ దాని ముందు వెళ్తున్న బైక్ను ఢీ కొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న నాగ్లూర్ గ్రామానికి చెందిన భాస్క (42) మృతిచెందినట్లు గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపారు.