calender_icon.png 20 October, 2024 | 4:13 PM

రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు..

20-10-2024 01:10:20 PM

కుమ్రంభీం అసిఫాబాద్, (విజయక్రాంతి): రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రహదారిపై అన్నదాతలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కోవలక్ష్మి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా కోవలక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

ప్రతి ఎకరానికి రైతు భరోసా పథకం కింద 15 వేల రూపాయలు వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందజేస్తామని ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కి ఇవ్వడం కుదరదని ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు పరచకుంటే భవిష్యత్తులో రైతుల గుణపాఠం చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, మాజీ సర్పంచ్ మార్సుకోల సరస్వతి, భీమేష్, శ్రీనివాస్, కిష్టయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జాబోరే రవీందర్, నాయకులు కుమార్, బలరాం, మల్లేష్, ఉమా రైతులు, నాయకులు పాల్గొన్నారు.